పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయుధ భద్రతా దళాలు కవాతు నిర్వహించాయి. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పోలీసులు సూచించారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని గురువారం పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.