ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి మహోత్సవాలు
సికింద్రాబాద్ లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు వాసవి మాతకు కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటి సభ్యులు, భక్త బృందం తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.