
హైదరాబాద్లో వ్యక్తి దారుణ హత్య
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బుధవారం వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రైల్వే వంతెన కింద కొందరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరుగడంతో ఓ వ్యక్తిని దుండగులు రాళ్లతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.