విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి

67చూసినవారు
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి
చర్లపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఓ వ్యక్తి విద్యుత్‌షాక్‌ గురై మృతి చెందాడు. మేడ్చల్‌ జిల్లా ఘన్‌పూర్‌కు చెందిన శివనాయక్‌(23)ఉప్పల్‌లో నివాసం ఉంటున్నాడు. చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఫేజ్‌2లో ఉండే బయోపల్స్‌లో ఎలక్ట్రీషియన్‌గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇవాళ పరిశ్రమలోని గోడకు డ్రిల్‌ చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తెగిపొవడంతో శివనాయక్‌ షాక్‌కు గురై మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్