ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత... మీడియా లోగోల ధ్వంసం

14267చూసినవారు
హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ భూములు లాక్కుని తమ‌ కేసులు పెట్టారని ఆరోపిస్తూ మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కొంతమంది దళితులు ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమను హుజురాబాద్ లో ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ అభ్యర్థి ఈటల రాజేందర్ పై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటల అనుచరులు ప్రెస్ క్లబ్‌లో దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ మీడియా లోగోలను ధ్వంసం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్