మోడల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పదిలీలు, పదోన్నతులు చేపట్టకపోవడం, 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వకపోవడం తదితర డిమాండ్ పరిష్కారం కోరుతూ ఈనెల 24 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, ప్రధాన కార్యదర్శి కే. నాగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 27న తహాసిల్దార్, ఎంఈవోలకు, 28న డీఈవోలు, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు.