ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అడవిని వందలాది మంది బీఎస్ఎఫ్ జవాన్లు జల్లెడ పడుతున్నారు. ఎన్కౌంటర్ స్పాట్లో మొత్తం 70 మంది మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 40 మందికి పైగా మావోయిస్టులు పారిపోయినట్లు అంచనా వేస్తున్నారు. మిగతా మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. ఎన్నికల వేళ అలెర్ట్గా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.