ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటేసేందుకు హీరో విశాల్ సైకిల్పై రావటం వైరల్గా మారిన విషయం తెలిసిందే. అయితే హీరో విజయ్ను ఇమిటేట్ చేశారని చాలామంది చర్చించుకున్నారు. దీనిపై 'రత్నం' ఈవెంట్లో విశాల్ స్పందించారు. వ్యక్తిగత కారణాల వల్ల పోలింగ్ కేంద్రానికి సైకిల్పై వెళ్లానని అన్నారు. విజయ్ అంటే తనకెంతో ఇష్టమని, విజయ్ను ఇమిటేట్ చేయటం కోసం అలా చేయలేదని చెప్పారు. ప్రస్తుతం తనకు కారు లేదని, కొంతకాలం క్రితం అమ్మేసినట్లు తెలిపారు.