అయోధ్యలోని రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. దీంతో
భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఈ వేడుకలను జరుపుకున్నారు. ఇదిలా ఉండగా దుబాయ్లోని బుర్జ్ ఖలీఫాపై రాముడి చిత్రం ప్రదర్శించినట్లుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఆ చిత్రం నిజమా? లేక ఎడిట్ చేసిన ఫోటోనా అనేది తెలియాల్సి ఉంది. కాగా రాముడి ఫోటో బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం నిజంగా గర్వించదగ్గ విషయం అని నెట్టింట కొందరు కామెంట్స్ చేస్తున్నారు.