అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బఠానీల దిగుమతులతో పాటు ఇతర పప్పు ధాన్యాల లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కేంద్ర వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి నిధి ఖారే ఆదేశించారు. దిగుమతి చేసుకున్న కొన్ని రకాల పప్పులు మార్కెట్కు చేరడం లేదని నివేదికలొస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వచ్చేలా స్టాక్ హోల్డింగ్ సంస్థలు వీక్లీ స్టాక్ వివరాలు తెలపాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని నివేదిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.