యూపీలోని గోరఖ్పూర్ సీఎం యోగి స్వస్థలం. ఇక్కడ జూన్1న పోలింగ్ జరగనుంది. గోరఖ్పూర్లో ఈసారి బీజేపీ వర్సెస్ సమాజ్వాదీ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడి నుండి ప్రస్తుత ఎంపీ, నటుడు రవికిషన్ బీజేపీ తరపున బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ భోజ్పురి నటి కాజల్ నిషాద్కు ఇక్కడ టికెట్ కేటాయించింది. వీరి మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.