సెన్సెక్స్ గత ఏడాది డిసెంబరు 11 నుంచి ఈనెల 3 మధ్య 10వేల పాయింట్లు పెరిగింది. మార్కెట్ విలువ రూ.138.89లక్షల కోట్ల నుంచి రూ.158లక్షల కోట్లకు చేరింది. ఐదు స్టాక్స్ నుంచే మార్కెట్లలో 50% వృద్ధి నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతి ఎయిర్టెల్, SBI, మహీంద్రా & మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇక TCS, అదానీ పోర్ట్స్, HDFC వంటి 11 స్టాక్స్తో 30% వృద్ధి నమోదైంది.