జ్ఞానవాపి కాంప్లెక్స్లో హిందూ దేవతలకు పూజలు ప్రారంభమయ్యాయి. నేలమాళిగలో పూజ చేసేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈరోజు తెల్లవారుజామున పూజలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి దగ్గర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు వారణాసిలో జ్ఞానవాసి మసీదు అని రాసి ఉన్న సైన్ బోర్డులపై మందిర్ స్టిక్కర్లు అతికించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.