డెయిరీలు నిర్వహిస్తున్న వారు పశుపోషణలో నిర్వాహణ ఖర్చు తగ్గించుకోవడానికి పండ్లతోటలో పశుగ్రాసం ఏర్పాటు చేసుకుంటారు. దీనికోసం పశుగ్రాసాలైన లూనర్స్, బెర్నీమ్, అలసంద, పిల్లిపెసర, జనుము వంటి జాతి గ్రాసాలను పెంచుతుంటారు. దీని వల్ల భూమిలో నత్రజని శాతం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా పంటలకు రసాయన ఎరువులను వాడాల్సిన అవసరం తగ్గుతుంది. అలాగే ఈ పైరు సాగును ప్రతి 3-4 ఏళ్లకు ఒకసారి పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది.