జమ్ముకాశ్మీర్లోని అనంతనాగ్ -రాజౌరీ లోక్సభ స్థానం ఇండియా కూటమి నేత మియాన్ అల్తాఫ్ గురువారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన నేషనల్ కాన్ఫరెన్స్ తమ పార్టీ తరపున గుల్జార్ నేత మియాన్ అల్తాఫ్ను అభ్యర్థిగా ప్రకటించింది. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఎన్సి ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పాల్గొన్నారు. మిత్రపక్షాల సహకారంతో తమ అభ్యర్థి విజయం సాధిస్తారని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు.