ఎన్టీఆర్, రామోజీరావు ఇద్దరూ యుగపురుషులని సీఎం చంద్రబాబు కొనియాడారు. "ఎన్టీఆర్, రామోజీరావులకు భారతరత్న సాధించడం మన బాధ్యత. రాజధానికి అమరావతి పేరును ఆయనే సూచించారు. అందుకే అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో ఒక రోడ్డుకు రామోజీ మార్గం అని పేరు పెడతాం. విశాఖలో రామోజీ పేరిట చిత్రనగరి, ఎన్టీఆర్ ఘాట్ మాదిరి మెమోరియల్ నిర్మిస్తాం." అని సీఎం పేర్కొన్నారు.