కోవిడ్‌ను భారత్ దీటుగా ఎదుర్కొంది: కేంద్రమంత్రి

75చూసినవారు
కోవిడ్‌ను భారత్ దీటుగా ఎదుర్కొంది: కేంద్రమంత్రి
కోవిడ్-19ను భారత్ దీటుగా ఎదుర్కొందని విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న జైశంకర్ అక్కడి ప్రవాస భారతీయులతో పెర్త్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. వందలాది దేశాలకు వ్యాక్సిన్ అందించి సహకార దేశంగా అవతరించామని కొనియాడారు. కోవిడ్ సమయంలో వివిధ దేశాల నుంచి 7 మిలియన్ల మంది భారతీయులను తిరిగి దేశానికి తీసుకురాగలిగామన్నారు. 1.4 బిలియన్ల మందికి టీకాలు వేయించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్