మార్చి నెలలో భారత రూపాయి విలువ మెరుగైంది. డాలర్తో పోలిస్తే ₹87.5 నుంచి ₹85.5 కు చేరుకుంది. 20 రోజుల్లో రూ.2 లాభం నమోదైంది. ఈ మార్పు వెనుక ఆర్థిక విధానాలు, విదేశీ పెట్టుబడులు, మార్కెట్ వృద్ధి వంటి అనేక కారణాలు ఉన్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. రూపాయి బలపడటంతో దిగుమతుల ఖర్చులు తగ్గే అవకాశం ఉండగా, ఎగుమతిదారులు మాత్రం కొంత ప్రభావితమవ్వొచ్చని తెలిపారు.