పిచ్చికుక్క దాడిలో పసికందు దుర్మరణం

69చూసినవారు
పిచ్చికుక్క దాడిలో పసికందు దుర్మరణం
మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లిలో సోమవారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం చెట్లముప్పారంకు చెందిన వెంకన్న, రేణుక దంపతుల చిన్న కుమారుడుకి (42 రోజులు) సోమవారం ఉదయం రేణుక పాలు పట్టి ఇంటి బయట మంచంపై పడుకోబెట్టింది. ఇంతలో వచ్చిన ఓ పిచ్చికుక్క నిద్రిస్తున్న పసికందుపై దాడి చేసింది. చెవులు, తలభాగంలో కొరకడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే చిన్నారిని వరంగల్‌ ఎంజీఎంకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్