బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఇప్పటికే విష్ణుప్రియ, రీతూచౌదరి, టేస్టీ తేజ, కిరణ్గౌడ్ విచారణ పూర్తి అయింది. విచారణ భయంతో హర్షసాయి, ఇమ్రాన్, భయ్యా సన్నీయాదవ్ దుబాయ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. సినీతారలపై కేసులు విషయంలో పోలీసులు న్యాయసలహా తీసుకోనున్నారు. సినీనటులు, ఇన్ఫ్లూయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్తో భారీగా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఏయే మార్గాల్లో డబ్బు వచ్చిందని పోలీసుల ఆరాతీస్తున్నారు.