సాయుధ దళాల ఆధునికీకరణే లక్ష్యంగా ఈ ఏడాదిని ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించిన రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (DAC) రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో T-90 ట్యాంకుల ఆధునికీకరణలకు సంబంధించిన ప్రతిపాదనలూ ఉన్నాయి.