యూపీలోని ఘజియాబాద్లో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం చేసి చంపేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏడేళ్ల బాలిక సడెన్గా చనిపోయింది. పక్కింటివారు ఇచ్చిన స్వీట్ తినడంతో బాలిక చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో బాలిక అత్యాచారానికి గురై చనిపోయినట్లు తేలింది. దీంతో తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు.