ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

73చూసినవారు
ఫోన్ వాడొద్దన్నందుకు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ లో సెల్ ఫోన్ అతిగా వాడొద్దన్నందుకు విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బహదూర్పురా ఇన్‌స్పెక్టర్‌ ఆర్.రఘునాథ్ వివరాల ప్రకారం.. కిషన్ బాగ్ కు చెందిన అశుతోష్ జాదవ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. రోజూ గంటల కొద్దీ ఫోన్ లో గడుపుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన అశుతోష్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్