IPL- 2025లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అహ్మదాబాద్లో రాత్రి 7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో రెండు జట్లు తమ మొదటి మ్యాచుకు ఓటమితోనే ప్రారంభించడంతో, ఈవాళ ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని చూస్తున్నాయి. స్లో ఓవర్ రేటు కారణంగా తొలి మ్యాచుకు దూరమైన MI కెప్టెన్ హార్దిక్ ఇవాళ తుది జట్టులోకి రానున్నారు. అతని రాకతో MI గెలుపు బాట పడుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.