టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచ్లో భారత బౌలర్ అర్షదీప్ చెలరేగుతున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు వచ్చిన ఐర్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తన రెండో ఓవర్లో అర్షదీప్ ఇద్దరు ఐర్లాండ్ బ్యాటర్లను పెవిలియన్కు పంపాడు. తొలి బంతికి పాల్ స్టిర్లింగ్ను, చివరి బంతికి ఆండ్రూ బల్బిర్నీని ఔట్ చేశాడు. దీంతో ఐర్లాండ్ 9 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది.