పురాణాల ప్రకారం రథసప్తమి రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. రథసప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి అనంతరం వచ్చే రథసప్తమి రోజున సూర్యుడిని పూజించడం వల్ల ఆర్థిక పరమైన రంగాల్లో మంచి జరుగుతుందని భావిస్తారు. ఆరోగ్యం విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతారని భక్తులు నమ్ముతారు.