ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీ అది: ఈటల

82చూసినవారు
ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీ అది: ఈటల
దేశ ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీ కాంగ్రెస్ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. ఆదివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గతిలేక ప్రజలు అధికారంలోకి తీసుకొస్తే వారి డాబు, దర్పం, వసూళ్ళు మళ్లీ మొదలయ్యాయన్నారు. సామాజిక న్యాయం పాటించిన బీజేపీకి కాంగ్రెస్ తో పోలిక ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్