చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో 3000 రన్స్ పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో ఇప్పటివరకు మొత్తం 242 మ్యాచ్లు ఆడిన రవీంద్ర జడేజా 3001 పరుగులు పూర్తిచేసుకున్నారు. IPL-2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో జడేజా ఈ రికార్డును సాధించారు. అలాగే ఐపీఎల్లో జడేజా ఇప్పటివరకు మొత్తం 160 వికెట్లు తీశారు.