థాయ్ లాండ్లో భూకంపం సంభవించడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. ఏ భారతీయ పౌరుడికీ అవాంఛనీయ ఘటన తలెత్తినట్లు తమ దష్టికి రాలేదని తెలిపింది. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే.. భారతీయులు ఎమర్జెన్సీ నంబర్ 66 618819218ను సంప్రదించాలని సూచించింది.