AP: మాజీ సీఎం జగన్పై మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో విద్యాశాఖ, ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యం వహించిందని అన్నారు. ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెట్టిన ఘనత జగన్ సర్కార్ దే అంటూ మండిపడ్డారు. విద్యా రంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించాలని కోరారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే రఘువర్మను భారీ మెజార్టీతో గెలిపించాలని గంటా శ్రీనివాస్ రావు కోరారు.