రాజకీయాల్లో ఉండదగని వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు. ఏజెన్సీతోపాటు సిబ్బందినీ మార్చారు. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు. పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు’’ అని విమర్శించారు. ‘ఈ ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు’ అన్నారు.