మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన ఇరువురి భేటీలో చర్చించిన విషయాలను మీడియాకు వెల్లడించడానికి జగ్గారెడ్డి నిరాకరించారు. ఈ క్రమంలోనే బుధవారం ఆయన ఢిల్లీ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జగ్గారెడ్డి ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నట్లు సమాచారం.