ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు

82చూసినవారు
ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు
మెట్ పల్లి పట్టణంలో శాస్త్రి చౌరస్తా వద్ద సోమవారం పట్టణ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంపీపీ మారు సాయి రెడ్డి అధ్యక్షతన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినందున ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎంపీపీ మారు సాయి రెడ్డి మాట్లాడుతూ తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ జగిత్యాల నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్