ఎన్డీయేలో భాగమైన జనసేన పార్టీ ఫోకస్ మొత్తం ఏపీ పాలిటిక్స్ పైనే ఉంది. అందుకే కేంద్ర కేబినెట్లో చేరలేదని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జనసేన ఎంపీలుగా గెలిచారు. ఉదయ్ శ్రీనివాస్ తొలిసారి ఎంపీ కాగా, బాలశౌరి మూడోసారి ఎంపీగా గెలిచారు. వీరిలో ఒకరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని అనుకున్నప్పటికీ అది జరగలేదు.