బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకు తాజాగా కేంద్ర కేబినెట్లో స్థానం దక్కింది. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు ఇవాళ ఆయనకు ఆరోగ్య శాఖతో పాటు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖను కేటాయించారు. కాగా నడ్డా హెల్త్, కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత బీజేపీ ప్రభుత్వంలో ఈ శాఖను మన్సుఖ్ మాండవీయ మంత్రిగా నిర్వహించారు.