బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య మల్లికా నడ్డాకు చెందిన ఎస్యూవీ టయోటా ఫార్చ్యూనర్ కారు దొరికింది. గత నెల 19న ఢిల్లీలో చోరీకి గురైన కారును వారణాసిలో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ సమీపంలోని బధకల్ ప్రాంతానికి చెందిన సలీం, త్రిపాఠి, మహ్మద్లు చోరీకి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కారును నాగాలాండ్కు తరలించే క్రమంలో వారణాసి వద్ద పట్టుబడింది.