ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ఫైనల్‌కు చేరిన జ్యోతి జట్టు

62చూసినవారు
ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3లో ఫైనల్‌కు చేరిన జ్యోతి జట్టు
తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3లో భారత మహిళల కాంపౌండ్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్‌లో భారత జట్టు 235-227 తేడాతో ఎల్ సాల్వడార్ టీమ్‌ను ఓడించింది. ఈ నెల 22న జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ త్రయం స్వర్ణ పతకం కోసం ఎస్టోనియాతో పోరాడనుంది. మరోవైపు, భారత పురుషుల కాంపౌండ్ జట్టు 235-236 తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి బ్రాంజ్ మెడల్ కోల్పోయింది.

సంబంధిత పోస్ట్