మోస్రా మండల కేంద్రంలోని కిసాన్ కేత్ మండల అధ్యక్షులు తోటరాజు తల్లి తోట మల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవారం రాష్ట్ర ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. పరామర్శించిన వారిలో మండల అధ్యక్షులు కొత్తిమీరకర్ లక్ష్మణ్ , అశోక్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.