మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు.. ఎస్సై జగన్నాథం

53చూసినవారు
మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైచట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై జగన్నాథం అన్నారు. బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట చౌరస్తాలో శుక్రవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలకు సంబంధించిన ద్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శంకర్, లక్ష్మీకాంత్, మోహిన్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్