కామారెడ్డి-నిజామాబాద్ జిల్లాలకు వరప్రదయినిగా నిలుస్తున్న నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల రిజర్వాయర్ లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ప్రాజెక్టులో 1, 348 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. పూర్తిస్థాయి నీటిమట్టం 1, 405 అడుగులు కాగా, ప్రస్తుతం 1, 391. 49అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివ ప్రసాద్ తెలిపారు.