గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: ఎంపీవో

84చూసినవారు
గ్రామాలలో నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి: ఎంపీవో
నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా పిట్లం మండలం మద్దెల చెరువు గ్రామపంచాయతీలో ఎస్డిఎఫ్ నిధుల ద్వారా చేపట్టిన బోరు మోటర్ పైప్ లైన్ పనులను శనివారం పిట్లం మండల ఎంపీఓ బ్రహ్మం పరిశీలించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కొత్తగా వేసిన బోరు ద్వారా మిషన్ భగీరథ నీటి సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రామపంచాయతీ సోర్స్ ద్వారా త్రాగునీరు అందజేయుటకు సౌకర్యం కలుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్