ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

66చూసినవారు
ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. మంగళవారం భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ఉన్న రైతు వేదిక కార్యాలయంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శివప్రసాద్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, బిజెపి మండల అధ్యక్షుడు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్