గీత కార్మికులు జాగ్రత్తలు పాటించాలి: సీఈఓ

81చూసినవారు
గీత కార్మికులు జాగ్రత్తలు పాటించాలి: సీఈఓ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ (కలాన్) గ్రామ పంచాయతీలో గురువారం జిల్లా జడ్పీ సీఈఓ, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ చందర్ నాయక్ గౌరారం, కుర్తి, సిద్ధాపూర్, బొల్లక్ పల్లి గ్రామాలకు చెందిన కల్లు గీత కార్మికులతో సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న గీత కార్మికుల కిట్లు గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పిట్లం కమలాకర్, ఎంపీఓ యాదగిరి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు భాస్కర్, రవి, వినోద్, గీత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్