అడ్వాన్స్ జేఈఈలో నవోదయ విద్యార్థుల ప్రతిభ

76చూసినవారు
అడ్వాన్స్ జేఈఈలో నవోదయ విద్యార్థుల ప్రతిభ
అడ్వాన్స్ జేఈఈ ఫలితాలలోనిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారని విద్యాలయ ప్రిన్సిపల్ సత్యవతి సోమవారం పేర్కొన్నారు. ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన పరీక్షలో బి. శ్రీశాంక్ 265 ర్యాంకు, బి. జగన్ 953 ర్యాంకు సాధించారని ఆమె పేర్కొన్నారు. జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విద్యాలయం పేరు ప్రఖ్యాతలను జాతీయస్థాయిలో ఇనుమునింపజేసిన విద్యార్థులను ప్రిన్సిపల్, అధ్యాపక బృందం అభినందించారు.

సంబంధిత పోస్ట్