నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కామారెడ్డి ఎమ్మెల్యే కెవిఆర్ గ్రామగ్రామాన ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెలో మండలానికి సంబంధించి ప్రజలు వేసిన ఫిర్యాదుల వివరాలను రాజంపేట మండల కేంద్రం లో స్థానిక తహసీల్దార్, ఎంపీడీవోలకు మండల బీజేపీ నాయకులు ఎమ్మెల్యే తరుపున దరఖాస్తులను అందజేయటం జరిగింది. బండారి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే కెవిఆర్ ప్రజలకు ఇబ్బందులు ఉంటే నేరుగా తనకు సంప్రదించాలన్నారు.