
ఏఆర్ డెయిరీలో రీప్రొడక్షన్ ప్రారంభానికి మద్రాస్ కోర్టు అనుమతి
ఏఆర్ డెయిరీలో తిరిగి ప్రొడక్షన్ ప్రారంభానికి మద్రాస్ కోర్టు అనుమతినిచ్చింది. ఏఆర్ డెయిరీ తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖర్ అరెస్టయ్యారు. గతంలో ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఆర్ డెయిరీ వెన్న తయారీలో లోపాలను గుర్తించి సంస్థ లైసెన్స్ను కూడా రద్దు చేసింది.