రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

1038చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
దోమకొండ మండలం అంచనూరు గ్రామ శివారులోని పోచమ్మ గుడి సమీపంలో బీబీపేట్ మండలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన అంతం మోహన్ రెడ్డి(55) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు దోమకొండ ఎస్సై చిందం గణేష్ బుధవారం తెలిపారు. మోహన్ రెడ్డి ఉదయం కామారెడ్డికి పని నిమిత్తం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లినట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెంది ఉండవచ్చునని కుటుంబ సభ్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్