కొనసాగుతున్న శ్రీ లక్ష్మమ్మ తల్లి దేవతా ప్రతిష్ట మహోత్సవం

81చూసినవారు
కొనసాగుతున్న శ్రీ లక్ష్మమ్మ తల్లి దేవతా ప్రతిష్ట మహోత్సవం
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామంలో ఈ నెల 2 నుండి 6వ తేదీ వరకు లక్ష్మమ్మ తల్లి దేవతా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ప్రాంతకాల పూజ, హవవనములు, యంత్ర ప్రతిష్ట, శ్రీ లక్ష్మమ్మ తల్లి దేవతామూర్తి, స్థిరికరణ, ప్రాణప్రతిష్ట, జీవన కాలన్యాసము, మహా పూజ, మహాన్నబలి, ఒడి బియ్యం పోయుట వంటి కార్యక్రమాలను నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్