ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం

74చూసినవారు
ఐఎస్ఆర్డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సదాశివనగర్ మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశంలో పాల్గొని ఓటు హక్కుపై మహిళలకు అవగాహన కల్పించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ, భావిభారత నిర్మాణంలో యువత ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర అన్నారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడుతూ, ఓటర్లే ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్