జహీరాబాద్ పరిధిలోని అల్లాదుర్గంలో ఈనెల 30న జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కామారెడ్డి ఎమ్యెల్యే కె. వి. రమణరెడ్డి కార్యకర్తలను కోరారు. బీజేపీ సన్నాహక సమావేశం శనివారం లింగంపేట్లో జరిగింది. ప్రతి కార్యకర్త మోడీని మళ్ళీ పిఎంగా చూడాలనే ఆకాంక్షతో సమిష్టి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, తదితర నేతలు పాల్గొన్నారు.